హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రిలిమ్స్ (Civils Prelims) పరీక్ష దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. రెండు సెషన్లలో పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్-2 నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభానికి అర గంట ముందుగానే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు.
మొత్తం 1056 ఉద్యోగాలు ఉండగా.. ప్రిలిమ్స్కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తెలంగాణ నుంచి 49,883 మంది ఉన్నారు. హైదరాబాద్లో 45,153 మంది, వరంగల్లో 4,730 మంది పరీక్ష రాస్తున్నారు. వీరికోసం 110 కేంద్రాలను ఏర్పాటు చేశారు.