హైదరాబాద్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): దేశాభివృద్ధికి, పేదల కోసం పనిచేసే అరుదైన అవకాశం సివిల్ సర్వెంట్లకు దక్కుతుందని లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు.
హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరుగుతున్న సివిల్ సర్వెంట్స్కు శిక్షణలో భాగంగా శనివారం ఆయన మాట్లాడారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా సివిల్ సర్వెంట్స్ టెక్నాలజీని అధికంగా వినియోగించాలని సూచించారు.