గోదావరిఖని, నవంబర్ 8: బొగ్గు పరిశ్రమను, సింగరేణి, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలంటే ప్రధాని మోదీకి నిరసన సెగ తాకాల్సిన అవసరం ఉన్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. ఈ నెల 12న ప్రధాని మోదీ ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా కార్మికులు నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం గోదావరిఖనిలోని శ్రామిక భవన్లో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని, బొగ్గు పరిశ్రమలను ప్రైవేట్పరం చేస్తున్నదని విమర్శించారు.