పెద్దపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాం ద్వారా పట్టణాలు, నగరాలు అందంగా ముస్తాబవుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రామగుండం ఒకటవ డివిజన్లో రూ. 50 లక్షల పట్టణ ప్రగతి నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో పట్టణాలను ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల మురికి కూపాలుగా మారేవని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అటు పల్లెలు, ఇట్టు పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు , మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, సర్పంచ్ ధర్మాజీ కృష్ణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.