కోరుట్ల, జనవరి 19 : జగిత్యాల జిల్లా కోరుట్లలో శుక్రవారం సీఐడీ అధికారులు పలువురు పాస్పోర్టు ఏజెంట్ల ఇండ్లపై దాడులు నిర్వహించారు. నాలుగు బృందాలుగా ఏర్పడి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక పోలీసుల సాయంతో ముగ్గురు పాస్పోర్ట్ ఏజెంట్ల ఇండ్లల్లో సోదాలు చేశారు. హైదరాబాద్లోని సీఐడీ కార్యాలయంలో కోరుట్లకు చెందిన ముగ్గురు పాస్పోర్టు ఏజెంట్లపై నమోదైన కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా అధికారులు వారి ఇండ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు పలు నకిలీ పాస్పోర్ట్లు, పాస్పోర్ట్ మార్ఫింగ్కు సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. పట్టణానికి చెందిన ముగ్గురు పాస్పోర్టు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టు సమాచారం.