హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాజస్థాన్లోని రామ్గఢ్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రాష్ట్రంలో సీఐడీ డీజీగా పనిచేస్తున్న గోవింద్సింగ్ కారు బోల్తాకొట్టింది. ఈ ఘటనలో గోవింద్సింగ్ భార్య షీలాసింగ్ అక్కడికక్కడే మృతిచెందారు. గోవింద్సింగ్ స్వల్పగాయాలు కాగా, డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన సొంత రాష్ట్రం రాజస్థాన్లో డీజీ గోవింద్సింగ్, అతని భార్య షీలాసింగ్ సోమవారం స్థానిక మాతేశ్వరి తనోతరాయ్ మాత ఆలయాన్ని సందర్శించేందుకు మహీంద్ర కారులో బయల్దేరారు. తిరుగుప్రయాణంలో రామ్గఢ్లోని ఘంటియాలీ మాత ఆలయ సమీపంలో కారు బోల్తా కొట్టింది. దాంతో షీలాసింగ్ మృతిచెందగా, గాయాలైన డీజీ గోవింద్ సింగ్, డ్రైవర్ విజయేందర్ స్థానిక జవహర్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గోవింద్సింగ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిసింది.
డీజీపీ మహేందర్రెడ్డి దిగ్భ్రాంతి
సీఐడీ డీజీ గోవింద్సింగ్ సతీమణి షీలాసింగ్ రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో డీజీపీ మహేందర్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన తన సహచర సీనియర్ అధికారి గోవింద్సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.