Congress | కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 28: కూకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇతర పార్టీ నుంచి వచ్చిన బండి రమేశ్ను ప్రకటించడంతో నియోజకవర్గంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే కూకట్పల్లి పార్టీ సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేయగా, మూసాపేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాలుగు పర్యాయాలు పనిచేసి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కీలకనేత చున్నూపాషా బీఆర్ఎస్లో చేరారు.
శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో చున్నూపాషా గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చున్నూపాషా మాట్లాడుతూ.. కాంగ్రెస్లో ఏండ్లతరబడి కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపులేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసిన వారికి ఆపదొస్తే ఆదుకునే వారేలేరని వాపోయారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమప్రాధాన్యం ఇనిస్తున్నారని.. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కొనియాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. పార్టీలో చేరినవారిలో ఎస్ నర్సింహ, ఎండీ షేర్, ఎండీ అన్నూ, ఎండీ సాజద్, టీ టింకు, పీ చేతన్, ఎండీ అహ్మద్, ఎండీ ఫరీద్, ఎండీ ఇస్రాజ్ ఉన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీశ్ అరోరా, కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్, డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, జగదీశ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.