Christmas | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఆదివారం అర్ధరాత్రి తరువాత చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందుకోసం చర్చీలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. మెదక్లోని ప్రపంచ ప్రఖ్యాత సీఎస్ఐ చర్చిలో సోమవారం తెల్లవారుజామున క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, పునరుత్థానానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన నక్షత్రాలతో చర్చి కొత్త శోభ సంతరించుకున్నది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.