21 లేదా 22న ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవాల కమిటీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. 21 లేదా 22వ తేదీలలో నిర్వహించే ప్రధాన వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలుస్తున్నది. మంగళవారం కమిటీ సభ్యులతో మంత్రులు మహమూద్అలీ, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి సమీక్ష నిర్వహించారు. మాసబ్ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో జరిగిన ఈ సమీక్షలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.