నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా చౌటుప్పల్ మండల పరిధిలోని ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్, నాలుగో రౌండ్లో టీఆర్ఎస్కు ఆధిక్యం రాగా, మిగతా రెండు, మూడో రౌండ్లలో బీజేపీ లీడ్లో ఉంది. ప్రస్తుతం నారాయణపురం మండల పరిధిలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు.