హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్ సహకారంతో తంబి ఏవియేషన్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలను బుధవారం ఉదయం ప్రారంభించింది. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి మేడారం జాతరకు భక్తులను తీసుకెళ్లనుంది.
ఒక్కో ప్రయాణికుడి రాకపోకలకు రూ. 19,999గా ఛార్జి నిర్ణయించారు. మేడారం జాతర ఏరియల్ వ్యూ వీక్షించాలంటే అదనంగా రూ. 3,700 చెల్లించాలి. అయితే నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జాతరకు 1.25 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.