Teenmar Mallanna | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసులపై చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, అతని అనుచరులు దాడి చేయడంతో పోలీసులు వారిని బుధవారం అరెస్టు చేశారు. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం మేడిపల్లి పోలీసులు (కట్ ఆఫ్ పార్టీ-మఫ్టీలో విధులు) పీర్జాదిగూడ రాఘవేంద్ర భవన్ వద్ద చైన్ స్నాచింగ్ సంఘటనలు చోటుచేసుకోకుం డా వాహనాల తనిఖీ నిర్వహించారు. రాత్రి 8 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు పోలీసుల వద్దకు వచ్చి వా గ్వాదానికి దిగారు. తాము పోలీసులమని చెప్పి నా వినకుండా దాడికి పాల్పడుతూ సమీపం లోని క్యూ న్యూస్ కార్యాలయానికి తీసుకెళ్లా రు. అక్కడ నవీన్పాటు నలుగురు వ్యక్తులు కలిసి దాడి చేశారు.
ఐడీ కార్డులు చూపించినా పట్టించుకోలేదు. సెల్ఫోన్లు లాగేసుకుని కర్రలతో కొట్టారు. చింతపండు నవీన్ ప్రోత్సహించడంతో అనుచరులు దాడికి తెగబడ్డారు. స మాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు సిబ్బందిని నవీన్, అతని అనుచరుల నుంచి కాపాడారు. కాపాడేందుకు వెళ్లిన పోలీసు అధికారులను సైతం అడ్డుకొని గందరగోళం సృష్టించారు. ఈ ఘటనపై పోలీసులు పలు ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసి తీన్మార్ మల్లన్న, బండారు రవీందర్, ఉప్పల నిఖిల్, సిర్ర సుధాకర్, చింత సందీప్కుమార్ను అరెస్టు చేశారు.