నల్లగొండ జిల్లా : భూవివాదంలో తలదూర్చి అత్యుత్సాహం చూపించిన చింతపల్లి(Chintapalli) ఎస్ఐ సతీష్ రెడ్డి(SI Satish Reddy)ని సోమవారం ఐ.జి.పి ఆదేశాల మేరకు సస్పెండ్(Suspended) చేసినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ వివాదాలు, సివిల్ విషయాలలో జోక్యం చేసుకోవద్దని ఎవరైనా ఈలాంటి కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు. కాగా, నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం లాకప్డెత్ జరిగింది. చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన సూర్యానాయక్(50)కు ఆయన సోదరుడికి మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నది.
ఇందులో అన్నదమ్ములు ఒకరిపై ఒకరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఎస్ఐ సతీశ్రెడ్డి ఆదివారం సాయంత్రం సూర్యనాయక్తోపాటు అతని సోదరుడిని పోలీస్ స్టేషన్కు పిలిచి విచారణ జరిపారు. ఈ క్రమంలో సూర్యనాయక్ హైబీపీతో స్టేషన్లోనే కిందపడిపోయాడు. వెంటనే అతడిని బంధువులు, పోలీసులు దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.