న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ: సంక్రాంతి పండుగ వేళ సరదాగా పతంగులు ఎగురవేసిన పలువురు పిల్లలు ప్రమాదాల బారిన పడ్డారు. విద్యుత్తు తీగలకు తగిలిన పతంగులను తీసుకొనే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. మైలార్దేవ్పల్లి ఠాణా పరిధిలోని కాటేదాన్కు చెందిన సంతోష్- శ్రావంతి దంపతుల కుమారుడు వివేక్ (10) చిన్నారులతో కలిసి గాలిపటాలు ఎగరవేస్తున్నాడు. విద్యుత్తు తీగలకు తగిలిన పతంగిని తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వివేక్ను హుటాహుటిన దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో గాలిపటం తెగి పక్కనే హైటెన్షన్ విద్యు త్తు తీగలకు చుట్టుకోవడంతో తీసేందుకు యత్నించిన ఇద్దరు స్కూల్ పిల్లలు కరెంట్ షాక్కు గురయ్యా రు. ఒకరికి ము ఖం, కాళ్లు, చేతు లు కాలిపోగా అపస్మారకస్థితికి చేరుకున్నాడు. మరొకరు దాబాపై నుం చి కింద పడడంతో తీవ్రగాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కరణ్సింగ్ (25) గాలిపటం ఎగురవేయగా, దారం తెగిపోయింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద చిక్కిన గాలిపటాన్ని తీసే క్రమంలో అదుపు తప్పి ట్రాన్స్ఫార్మర్పై పడటంతో కరణ్సింగ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన ఆటోడ్రైవర్లు పరుగున వచ్చి కరెంట్ సరఫరా నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన కరణ్సింగ్ను బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. మధురానగర్ పోలీస్ పరిధిలోని రహ్మత్నగర్కు చెందిన కపిల్దేవ్ (23) సోమవారం స్నేహితులలో ఐదు అంతస్థుల భవనంపైకి ఎక్కి పతంగులు ఎగురవేశాడు. 3వ అంతస్థులో మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు లిఫ్ట్ కోసం ఏర్పాటు చేసిన గుంతలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన కపిల్దేవ్ను యూసుఫ్గూడలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.