హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాయదుర్గం భూముల వేలం వివాదంపై ఎస్బీఐతో సీఎస్ రామకృష్ణారావు మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ భూములకు ఎస్బీఐ బృందం అంగీకారం తెలిపినట్టు సమాచారం.
ప్రభుత్వం తమ భూమిని వేలం వేసిందని ఎస్బీఐ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో కేసు ఉపసంహరణకు చర్యలు చేపడతామని ఎస్బీఐ ప్రతినిధులు హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది.