హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ధరణి పునర్మిర్మాణ కమిటీ ఈ నెల 24న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 12 అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అవి: 1) పెండింగ్ దరఖాస్తులు, వాటి పరిష్కారానికి సూచనలు.2) నిషేధిత జాబితాలో ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు.
3) అడ్హాక్ ల్యాండ్ ట్రిబ్యునల్స్ ద్వారా పరిష్కారమైన కేసులు, సంబంధిత అంశాలు. 4) సాదాబైనామా దరఖాస్తుల స్థితి. 5) ఆర్ఎస్ఆర్/సేత్వార్కు సంబంధించిన సమస్యలు. 6) అధికారుల బాధ్యతలు, ఆర్వోఆర్ చట్టంలో చేయాల్సిన మార్పులు. 7) రిజిస్ట్రేషన్లలో సమస్యలు. 8) ఇనాం, జాగీర్ వంటి వాటిపై పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు. 9) షెడ్యూల్డ్ ఏరియాల్లో భూముల సమస్యలు. 10) రెవెన్యూ-అటవీ శాఖల మధ్య విభేదాలు. 11) దేవాదాయ, వక్ఫ్బోర్డుకు సంబంధించిన సమస్యలు. 12) భూ పరిపాలనకు సంబంధించి రెవెన్యూ వ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు