హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒకరికీ సంక్షేమం అందించి, అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. నూతన సంవత్సరాన్ని ‘రైతు-మహిళ-యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నవారి ఆశలు అతి త్వరలో ఫలిస్తాయ ని చెప్పారు. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండాసురేఖ, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.