హైదరాబాద్, జనవరి14 (నమస్తే తెలంగాణ): దావోస్ వేదికగా తెలంగాణ నెక్ట్స్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ను సీఎం రేవంత్రెడ్డి ప్రకటించనున్నారు. ప్రపంచ పరిశ్రమ నాయకులు, సీనియర్ ప్రభుత్వాధికారుల ఆధ్వర్యంలో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సు ఈనెల 19న ప్రారంభం కానున్నది. ఆ వేడుకలో సీఎం రేవంత్రెడ్డి, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దావోస్ వేదికగా తెలంగాణ నెక్ట్స్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో తెలంగాణను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పాలసీని రూపొందిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.