హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దావోస్లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనడంతోపాటు బ్రిటన్లో పర్యటించనున్నారు. 15 నుంచి 18 వరకు దావోస్లో జరి గే సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత మరో 3 రోజులు బ్రిటన్లో పర్యటించి, పలువురితో సమావేశం కానున్నారు. ఈ పర్యటన కోసం సీఎంతోపాటు 8 మంది సభ్యుల బృందం వెళ్లనున్నది. ఇందులో సీఎం ముఖ్యకార్యదర్శి వీ శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, పెట్టుబడులు, ప్రచారం, విదేశీ వ్యవహారాల ముఖ్యకార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి ఉన్నారు.