హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల జ్యోతి పనులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతృప్తి వ్యక్తంచేశారు. అనుకున్నవిధంగా పనులు జరుగుతున్నాయని, వాటిని మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణకు తలమానికంగా నిలువనున్న బీఆర్ అంబేదర్ సచివాలయం, అంబేదర్ 125 అడుగుల భారీ విగ్రహం, అమరవీరుల జ్యోతి పనుల పురోగతిని సీఎం కేసీఆర్ శుక్రవారం పరిశీలించారు. రెండు గంటలకుపైగా కలియ తిరుగుతూ పనుల తీరును పరిశీలించారు. నిర్మాణాలు అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తంచేశారు.
తొలుత సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఎలివేషన్ పనులను, ఫౌంటెయిన్, గ్రీన్లాన్, టూంబ్ నిర్మాణానికి అమరుస్తున్న స్టోన్ డిజైన్ తదితర పనుల పురోగతిని పరిశీలించారు. సచివాలయ ప్రధాన ద్వారం విశాలంగా నిర్మించిన తీరుపై సంతృప్తి వ్యక్తంచేసిన సీఎం.. భోపాల్ నుంచి ప్రత్యేకంగా ఉడ్ కార్వింగ్ ద్వారాన్ని తెప్పించి అమర్చిన విధానాన్ని ప్రశంసించారు. అనంతరం సీఎం చాంబర్ ఉండే 6వ అంతస్తుకు చేరుకున్న కేసీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన ఫర్నిచర్ను పరిశీలించారు. గత పర్యటనలో తాను చేసిన సూచనలకు అనుగుణంగా వాల్క్లాడింగ్, ఇంటీరియర్ తుదిమెరుగులు దిద్దుకుంటున్న విధానంపై సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. మంత్రి వేముల, అధికారులను, వర్క్ ఏజెన్సీ సిబ్బందిని అభినందించారు.
సచివాలయంలోనిర్మాణమవుతున్న చాంబర్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చేసిన ఏర్పాట్లపై ఆనందం వ్యక్తంచేశారు. సీఎం చాంబర్లోని సమావేశ మందిరాన్ని, సీఎంవో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన చాంబర్లను, అందులో అమరుస్తున్న ఫర్నిచర్ను పరిశీలించారు. సిబ్బంది పనికి అనుగుణంగా ఏర్పాట్లు ఉన్నాయా లేవా అని అధికారులను ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాంబర్ను, వారి సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలను, కాన్ఫరెన్స్ హాల్ను, సందర్శలు వేచి ఉండే గదులను, వాటిలోని సౌకర్యాలను పరిశీలించారు. సమావేశాలు, డైనిం గ్ తదితర అవసరాలకు ఉపయోగించుకునేందుకు వీలుగా రూపొందించిన విశాలమైన హాలును తిలకించారు. నలుమూలలా కలియతిరిగిన సీఎం కేసీఆర్ కార్యదర్శులు, ఇతర సిబ్బంది కార్యాలయాలను పరిశీలించారు. మంత్రులకు కేటాయించిన శాఖలు అన్నీ ఒకే దగ్గర ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయా శాఖల సిబ్బంది కూడా ఒకేచోట ఉండేలా చూడాలని చెప్పారు. అనంతరం గ్రౌండ్ఫ్లోర్కు చేరుకున్న సీఎం, దక్షిణ భాగం గుండా నడుచుకుంటూ పారింగ్ పనులను పరిశీలించారు. సచివాలయం ప్రహరీకి అంతర్గతంగా ఉన్న, చుట్టూ బయటవైపు నిర్మిస్తున్న రోడ్లు, పరిసరాలను చూసిన ముఖ్యమంత్రి.. మంత్రి వేముల, వర్ ఏజెన్సీలకు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. సచివాలయం దక్షిణం నుంచి ఉత్తరం వైపు ట్యాంకుబండ్ మీదుగా వెళ్లే మార్గాన్ని, సచివాలయం ముందునుంచి నెక్లెస్ రోడ్డు దిశగా సాధారణ ప్రజలు, ప్రయాణికుల కోసం విశాలంగా నిర్మిస్తున్న రోడ్లను పరిశీలించారు. తాను అనుకున్నట్టుగానే సచివాలయ నిర్మాణ పనులు పూర్తవడంపై సంతోషం వ్యక్తంచేశారు.
సచివాలయం సమీపంలో నిర్మిస్తున్న బీఆర్ అంబేదర్ విగ్రహ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. అంబేదర్ విగ్రహం బేస్లో నిర్మిస్తున్న విశాలమైన హాళ్లు, ఆడిటోరియం, బయట ఫౌంటెయిన్, లాండ్ సేపింగ్ పనుల పురోగతిని పరిశీలించారు. పనుల పురోగతి గురించి మంత్రి కొప్పుల ఈశ్వర్ను, వర్ ఏజెన్సీలను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతలో ఎలాంటి లోటూ రావొద్దని స్పష్టంచేశారు. అంబేదర్ విగ్రహం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అకడినుంచి తెలంగాణ అమర వీరుల స్మారకార్థం నిర్మిస్తున్న స్మృతిజ్యోతి నిర్మాణ పనుల పురోగతిని కూడా కేసీఆర్ పరిశీలించారు. మొదటి అంతస్థులో నిర్మిస్తున్న ఆడిటోరియం, లేజర్ షో, ర్యాంప్, సెల్లార్ పారింగ్ పనులను పరిశీలించారు. నిర్మాణ పురోగతిని ఇంజినీర్లు మ్యాపుల ద్వారా సీఎంకు వివరించారు. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తంచేసిన కేసీఆర్.. కొన్ని సూచనలు చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, విప్ బాల సుమన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులున్నారు.