యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదం అందజేశారు. అనంతరం ఆయన ప్రధానాలయాన్ని పరిశీలించారు.
ఆయన వెంట ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఆలయ ఏఈవో శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం భువనగిరి పట్టణ శివారులోని రాయగిరి వద్ద నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయంలో నూతన ఈవీఎం గోడౌన్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ప్రారంభించారు.