హైదరాబాద్ : ఇప్పటికే మటన్ రేట్లు మండిపోతుండగా, మరోవైపు చికెన్ ధరలు కూడా ఆకాశాన్నంటాయి. దీంతో అటు మటన్.. ఇటు చికెన్.. కొనలేని పరిస్థితి ఏర్పడింది. మాంసం ధరలు అమాంతం పెరిగిపోవడంతో.. మాంసాహార ప్రియుల నోటికి తాళం వేసినట్లు అయింది. ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 300గా ఉంది.
ధరల పెరుగుదలకు పెళ్లిళ్లు కూడా ఓ కారణమని పౌల్ట్రీల యజమానులు చెబుతున్నారు. ఇక బోన్ లెస్ చికెన్ ధర మటన్ రేటుతో సమానంగా ఉంది. కిలో బోన్ లెస్ చికెన్ను సుమారు రూ. 600లకు తగ్గకుండా విక్రయిస్తున్నారు. ఐదు నెలల క్రితం కిలో చికెన్ ధర రూ. 80గా ఉండే. నాటుకోడి రేట్లు కూడా పెరిగిపోయాయి. కిలో నాటుకోడి రూ. 480గా పలుకుతోంది.