హైదరాబాద్, జనవరి8 (నమస్తే తెలంగాణ): గోదావరి-కృష్ణా- పెన్నా- కావేరి ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంసిద్ధత తెలిపింది. దీంతో ప్రాజెక్టు కీలక దశకు చేరుకున్నట్లయింది. ఈ మేరకు ముసాయిదా డీపీఆర్కు (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ ( ఎన్డబ్ల్యూడీఏ) ఆమో దించింది.
త్వరలోనే డీపీఆర్ను రాష్ర్టాలకు పంపి, అనంతరం సీఎంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ఎంవోయూ కుదుర్చుకోవాలని ఎన్డబ్ల్యూడీఏ చూస్తున్నది. గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా 148 148 టీఎంసీలను తామే పూర్తిగా వినియోగించుకొంటామని, ఆ మేరకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నామని ఛత్తీస్గఢ్ స్పష్టం చేసింది.