హైదరాబాద్ : ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు తరచూ హ్యాక్గు గురవుతున్న విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్గు గురైంది. గతరాత్రి ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించిన ఎంపీ.. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో వచ్చే పోస్టులు, మెసేజ్లకు స్పందించొద్దని ట్విట్టర్ ద్వారా ఎంపీ విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.