భూత్పూర్, మార్చి 5 : ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల భవితవ్యం పాలమూరు ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం కరివెన వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ టన్నెల్ పనులను వారు పరిశీలించారు.
కరివెన ప్రాజెక్టును 19.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మిస్తున్నారని, ఇప్పటికే రిజర్వాయర్ దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఎత్తిపోతలకు రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు సుమా రు 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.