ఫోటో…గుట్టపై భక్తుల కోలాహలం(23ఎన్కెఎల్30ఎ)
ఫోటో…స్వామివారి దర్శనానికి బారులుతీరిన భక్తులు(23ఎన్కెఎల్30బి)
ఫోటో…స్వామివారికి పూజలు నిర్వహిస్తున్న సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి(23ఎన్కెఎల్30సి)
నార్కట్పల్లి: మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. భక్తులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ భక్తులకు స్వామివారి ఆశీర్వాదంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు.కార్యక్రమంలో దేవాదాయ ధర్మకర్తలు రాధారపు భిక్షపతి, బొబ్బలి దేవేందర్ చిక్కుళ్ల యాదగిరి, నార్కట్పల్లి సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి వెంకటేశ్వర్లు దంపతుల తదితరులు పాల్గొన్నారు.