హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ టీఎస్) అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి ఆరు సంఘాలు మద్దతు తెలిపాయి. గురువారం హైదరాబాద్లోని పీఆర్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మద్దతు లేఖలు అందించాయి.
గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్, తెలంగాణ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్-కాంట్రాక్ట్, ఎయిడెడ్ స్కూల్ టీచ ర్స్ గిల్డ్, తెలంగాణ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్, ప్రొగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ సంఘాల బాధ్యులు కనకచంద్రం, శ్రద్ధానందం, అస్మతుల్లాఖాన్, శేషాచార్య, స్వరూపారాణి, జగదీశ్ మద్దతు తెలిపారు. పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్రెడ్డి, కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.