ఆదిలాబాద్ : ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించినందుకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు((Boath MLA Rathod Bapu rao)పై ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే 2012లో ఆదిలాబాద్ సమీపంలోని బట్టి సమర్గం సర్వే నెంబర్ 53/2లో రెండు గంటల భూమిని ఆదిత్య ఖండేకర్ అనే వ్యక్తికి విక్రయించారు. తిరిగి ఆ ప్లాట్లను 2019లో సంతోష్ అనే వ్యక్తి కొన్నారు. మొదట కొనుగోలు చేసిన ఆదిత్య ఖండేకర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతోపాటు సుదర్శన్ అనే వ్యక్తిపై 420 421 409,426 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ అశోక్ తెలిపారు.