ఎదులాపురం, అక్టోబర్ 18: ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని బట్టిసావర్గాం పంచాయతీ పరిధిలో రెండు ప్లాట్ల విషయమై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్పై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు బుధవారం ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ అశోక్ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆదిత్య ఖండేష్కర్కు బట్టి సావర్గాం సర్వేనంబర్ 53/2లో రెండు ప్లాట్లను 2012లో ఎమ్మెల్యే బాపురావ్, ఆయన భాగస్వామి సుదర్శన్లు అమ్మారు. మళ్లీ ఇదే సర్వేనంబర్ గల భూమిని 2019లో సంతోష్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయం ఆదిత్య ఖండేష్కర్కు తెలిసింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి ఎమ్మెల్యే రాథోడ్ బావురావ్, సుదర్శన్లపై 420, 409, 416, 421, 423 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.