హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లేఖ రాశారు. అక్టోబర్ 5న టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చామని, ఈ మార్పును ఎన్నికల కమిషన్ ఆమోదించిందని సీఎం కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల్లో టీఆర్ఎస్కు బదులుగా బీఆర్ఎస్ పేరును వాడాలని ఆయన కోరారు. పార్లమెంట్ ఉభయ సభలకు రాసిన లేఖలను శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ (బీఆర్ఎస్పీపీ) నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వర్రావు ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, సంతోష్కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్.. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందించారు.