ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల కండ్లల్లో వెలుగులు నింపుతున్నాయనడానికి ఉదాహరణ ఈ చిత్రం. మహబూబ్నగర్ మండలం వెంకటాపురంలో ఒకే కుటుంబానికి చెందిన రాములమ్మకు వృద్ధాప్య పింఛన్ రూ.2,016, ఆమె కొడుకు చంద్రయ్యకు రైతుబంధు, చంద్రయ్య కూతురు శిరీషకు కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ అందింది. చంద్రయ్య కొడుకు శ్రీధర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీ డియట్ చదువుతున్నాడు. చంద్రయ్యకు మొదటి విడుతలో గొర్రెలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ను ఎన్నటికీ మరువబోమని ఆనందంతో చెబుతున్నారు.
–మహబూబ్నగర్ ఫొటోగ్రాఫర్