హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న శరత్చంద్ర పవార్ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి బదిలీ చేశారు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్గా పనిచేసి, ఇటీవలే నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలోని మల్టి ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం మహబూబాబాద్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.