హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ : టీడీపీ మహానాడులో ఆ పార్టీ తెలంగాణ తాత్కాలిక అధ్యక్షుడు బక్కని నర్సింహులు తెలంగాణ ప్రజలను అవమానించడం దుర్మారమని, వెంటనే తెలం ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన నర్సింహులు ముక్కు నేలకు రాయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఉపేంద్ర డిమాండ్ చేశారు. తన గురువు చంద్రబాబు మెప్పు కోసం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడం సిగ్గుచేటని గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. ఆయనతో మాట్లాడించిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ గాలి పీల్చుతూ, వనరులను అనుభవిస్తున్న నర్సింహులుకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్ర తెలియకపోవడం అత్యంత దౌర్భాగ్యమని మండిపడ్డారు. మిడిగాణమిడి జ్ఞానంతో చరిత్ర తెలియని నారా లోకేశ్ తెలంగాణలో పార్టీని విస్తరిస్తానని ప్రగల్భాలు పలుకడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని తెలంగాణలో టీడీపీ ఎందుకు తుడిచిపెట్టుకుపోయిందో తెలుసుకోవాలని హితవు పలికారు. లోకేశ్, చంద్రబాబులాంటి దుష్టశక్తులు, వారికి మద్దతిస్తున్న తొత్తులపై తెలంగాణ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు.