హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకు న్న పరిణామాలపై ఉద్వేగానికి గురయ్యారు. ఉదయం సభలోకి వచ్చి న చంద్రబాబు మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేశారు. తిరిగి సీఎం అయ్యాకే సభలో అడుగుపెడుతానని శపథం చేశారు. చంద్రబా బు వెంట ఎమ్మెల్యేలు సైతం బయటకు వచ్చారు. అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హఠాత్తుగా వెక్కివెక్కి ఏడ్చారు. అసెంబ్లీలో తన భార్య వ్యక్తిత్వాన్నికించపర్చేలా మాట్లాడారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి తిరిగి వస్తానని ప్రతిజ్ఞ పూనారు. దీంతో తమ అధినేతను కించపర్చారంటూ టీడీపీ కార్యకర్తలు ఏపీలో పలుచోట్ల నిరసనలకు దిగారు. చంద్రబాబు శపథంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. బాబు దొంగ ఏడు పు ఏడుస్తున్నారని దుయ్యబట్టారు. అతని కుటుంబ సభ్యులపై మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. దొంగ ఏ డ్పుల ను ప్రజలు నమ్మరన్నారు. బాబు సానుభూతి పొందేలా కొన్ని మీడి యా సంస్థలు సహకరిస్తున్నాయని కొడాలి నాని విమర్శించారు. ఇటు వైసీపీపై టీడీపీ విమర్శలకు దిగింది. ‘మీ కన్నీటిబొట్టుకు కారణమైన ఏ ఒక్కడిని వదలం సార్. కచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం’ అని పరిటాల శ్రీరామ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జనసేన అధినేత పవన్ కుటుంబపరంగా విమర్శలు చేయొద్దని అన్నారు.