హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ రెండో సభ వాయిదా పడే అవకాశం ఉంది. రేపు జరగనున్న కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో సభ నిర్వహణ అంశంపై చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇబ్రహీంపట్నంలో సభ నిర్వహిస్తామని ఈ నెల 9న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.. కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సభను ఇబ్రహీంపట్నం నుంచి మార్చాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో మహేశ్వరం నియోజకవర్గంలో సభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.