హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): లెక్చరర్ దరఖాస్తుల సవరణకు మే 1 నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఎవరైనా పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టులకు గతేడాది డిసెంబర్ 7న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది.
మల్టీ జోన్-1లో 93, మల్టీ జోన్-2లో 154 పోస్టులు ఉండగా, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అత్యధికంగా 82 లెక్చరర్ ఉద్యోగాలున్నాయి. అభ్యర్థులు https://www. tspsc.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్లు ఎడిట్ చేసుకోవాలని సూచించారు. మెయిల్, పోస్టు, నేరుగా వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొన్నారు. అప్లికేషన్లో ఏ అంశాన్నైతే అభ్యర్థులు సవరించారో.. దానికి సంబంధించిన ధ్రువీకరణను తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మాట్లో సమర్పించాలని తెలిపారు.