హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న ‘చలో హైదరాబాద్’కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) పిలుపు ఇచ్చింది. సర్కార్ ఆలసత్వాన్ని నిరసిస్తూ వేలాది మంది టీచర్లతో ఆగస్టు 1న ఇందిరాపారు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెలలపల్లి పెంటయ్య ప్రకటనలో తెలిపారు. 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్లోని ఆరు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ను రద్దుచేసి, పాత పింఛన్ వర్తింపజేయాలని, మాడల్ స్కూల్టీచర్లను పాఠశాల విద్యలో విలీనం చేసి, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించడం వంటి 15 డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు.