హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మకు స్వరాష్ట్రంలో జయం తి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికం గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 10న ఐలమ్మ వర్ధంతిని, 26న జయంతిని నిర్వహించాలని ప్రభుత్వం రజక ఫెడరేషన్కు సూచించింది. ప్రభుత్వ నిర్ణయంపై రజక సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ కొండూరు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.