హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం ఎంతో కృషి చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు కూడా పని చేయాలని మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ సూచించారు. బుధవారం జిల్లా అధికారులతో ఆన్లైన్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీని మరింత పక్కాగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ పథకం ఫలితాలు ప్రతి మత్స్యకార కుటుంబానికి చేరాలన్నారు. అర్హులైన ప్రతి మత్స్యకారుడికి సొసైటీలో సభ్యత్వం ఇచ్చేలా ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. చేపల వంటకాలను ప్రజలకు చేరువ చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ఫిష్ ఫుడ్ ఔట్లెట్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు.