హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి హజ్ యాత్ర సజావుగా కొనసాగుతున్నదని, ఇప్పటి వరకు 35 విమాన సర్వీసుల ద్వారా 5250 మంది యాత్రికులు హజ్కు వెళ్లారని ఆ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీమ్ తెలిపారు. ఆదివారం ఉదయం బయలుదేరిన యాత్రికులకు ఆయన వీడ్కోలు పలికారు. యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.
సౌదీ ప్రభుత్వం కల్పించిన వసతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్ణాటక హజ్ కమిటీ చైర్మన్ రౌఫుద్దీన్ కచేరివాలే, తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్, ఇర్ఫాన్ ఉల్ హక్, నిజాముద్దీన్, జాఫర్ ఖాన్, హజ్కమిటీ ఏఈవో ఇర్ఫాన్ షరీఫ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.