మంత్రి కేటీఆర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 19 : ఆదిలాబాద్లోని సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించాలని కోరుతూ మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రికి లేఖ రాయడం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. కేంద్రం పరిశ్రమను తెరవడానికి ముందుకురాని పక్షంలో పదేండ్ల అగ్రిమెంట్తో రాష్ట్ర ప్రభుత్వమే పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరారు. శనివారం మంత్రి కేటీఆర్కు ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో సిమెంట్ అవసరాలు పెరిగిపోయి కొరత ఏర్పడుతున్న దృష్ట్యా పరిశ్రమ పునఃప్రారంభిస్తే కొరతను తీర్చడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించినవారవుతారని పేర్కొన్నారు.