హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్)ను సమర్థంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒకరినీ ఓటరు జాబితాల్లో చేర్చడంతోపాటు అనర్హుల పేర్లను తొలగించాల్సిన బాధ్యత ఈఆర్వోలదేనని స్పష్టంచేశారు.
బీఆర్కేభవన్లోని తన కార్యాలయంలో మేడ్చల్ మలాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఈఆర్వోలకు గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల జాబితాల్లో కచ్చితత్వం, పారదర్శకత, సమగ్రతను పాటించడమే ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.