హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఐదు నియోజకవర్గాల్లోని 6 స్థానాలకు స్థానిక కోటా లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఈవో శశాంక్ గోయల్ అధి కారులను ఆదేశించారు. శుక్రవారం ఎన్నికలు జరుగనున్న జిల్లాల్లో గురువారం సాయంత్రానికి ఏర్పాట్లన్నీ పూర్తిచేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. బుధవారం హైదరాబాద్లోని బుద్ధభవన్ నుంచి ఎన్నికలు జరిగే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గోయల్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం గా నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న జిల్లాల్లో బార్లు, పబ్బు లు, వైన్ షాపులు బంద్చేయాలని పేర్కొన్నారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో 5,326 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 2,329 మంది , స్త్రీలు 2,997 ఉన్నట్టు తెలిపారు. పోలింగ్ జరిగే జిల్లాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేయాలని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణ జరగాలని సీఈవో అదేశాలు జారీచేశారు.