Shantanu Narayen | ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 26: ప్రతిష్ఠాత్మక అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్కు అరుదైన గౌరవం దక్కనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకొన్న ప్రముఖుల జాబితాలో ఆయన పేరు చేరనున్నది.
ప్రపంచంలోని అత్యున్నతమైన కంపెనీలలో ఒకటైన అడోబ్కు సీఈవోగా పనిచేస్తున్న తొలి భారతీయుడిగా ఘనత సాధించిన ఆయనకు ఈ నెల 31న ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు 48 మంది ప్రముఖులు ఓయూ గౌరవ డాక్టరేట్ అందుకొన్నారు. గత 22 ఏండ్లలో నిరుడు మాత్రమే యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ అందజేశారు.