హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతున్నదని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కల్లాల డబ్బులు తిరిగి ఇవ్వాలని కేంద్రం అడగటం సిగ్గుచేటని అన్నారు. అంబానీ, అదానీలకు అండ గా నిలుస్తున్న కేంద్రం, రైతులకు మాత్రం మొండిచేయి చూపుతున్నాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తె లంగాణను ఆర్థికంగా దెబ్బతీసేందుకే రాష్ర్టానికి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నదని విమర్శించారు.
సీఎం కేసీఆర్ రైతుబిడ్డ కాబట్టే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రైతులకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారని కొనియాడారు. కాళేశ్వరం, ఎరువులు, రైతుబీమా, రైతుబంధు వంటి అనేక పథకాల వల్ల రాష్ట్రంలోని రైతులు రాజుల్లా బతుకుతున్నారని వివరించారు. వీటన్నింటిని సహించలేని కేంద్రం.. కావాలనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకురావటం చేతకాని రాష్ట్ర బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.