హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): నిరుడు యాసంగి, వానకాలం ధాన్యం మిల్లింగ్ గడువును కేంద్రం మరో నెల పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అశోక్ కుమార్ వర్మ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
సీఎమ్మార్ అందించడానికి డిసెంబర్ 31వరకు గడువు ఇచ్చారు. ఈ గడువు సరిపోదని, నవంబరు 17న ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.