ఊసరవెల్లులు ఉరేసుకొంటున్నాయి
మోదీ పనితీరు చూసి విస్తుపోతున్నాయి
గత పాలకులను మోదీ మించిపోయారు
విభజన హామీల అమలులో తీవ్ర వివక్ష
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే వ్యతిరేకత
కుట్రపూరిత చర్యలను తిప్పికొడతారు
బీజేపీ నేతలు కేంద్ర వైఖరిని నిలదీయాలి
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై రైల్వే మంత్రి ప్రకటనపై విరుచుకుపడ్డ కేటీఆర్
పునర్విభజన చట్టంలో పొందుపర్చిన హామీల అమలులో నరేంద్రమోదీ సరారు తీవ్ర వివక్ష చూపుతున్నది. మోదీ ప్రభుత్వ పనితీరును చూసి ఊసరవెల్లులు కూడా ఉరేసుకొంటున్నాయి. రైల్ కోచ్ఫ్యాక్టరీపై లెకలేనన్ని విజ్ఞప్తులు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కేంద్రం ఎన్నడూ స్పందించలేదు. – పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 5 : కేంద్రంలో మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం తెలంగాణను మరోసారి ధోకా చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఒకటైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం మాట మార్చడంపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం అవలంబిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలకు కొనసాగింపుగానే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారని ఆరోపించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ శనివారం ఒక ప్రకటన విడుదలచేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదాతోపాటు పునర్విభజన చట్టంలో పొందుపర్చిన హామీల అమలులో నరేంద్రమోదీ సరారు తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వ పనితీరును చూసి ఊసరవెల్లులు కూడా ఉరేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమని చెప్పి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణకు ధోకా ఇవ్వడంలో గత పాలకులను నేటి మోదీ మించిపోయారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పచ్చి తెలంగాణ వ్యతిరేకిగా ఉన్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్నదనడానికి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మాట తప్పడం మరొక ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు దకిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీని తుంగలో తొకడం తెలంగాణ అభివృద్ధి పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉన్న మోసపూరిత వైఖరిని బయటపెట్టిందని కేటీఆర్ విమర్శించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం చేసిన దగాతో తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా వరంగల్ ప్రాంతానికి తీరని నష్టం జరిగిందని తెలిపారు. ఇది కోచ్ ఫ్యాక్టరీతో ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ యువత కడుపు కొట్టడమేనని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల, వారి అభివృద్ధి పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రపూరిత విధానాలను ప్రజలు తప్పక తిప్పికొడతారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దకిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల సోయి ఉంటే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులు కేంద్రంలోని తమ ప్రభుత్వ ద్వంద వైఖరిని నిలదీయాలని డిమాండ్ చేశారు. ఓవైపు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా.. ఇకడి రాష్ట్ర బీజేపీ నేతలు ఒక మాట కూడా మాట్లాడకపోవడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమే అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకులు బుద్ధి తెచ్చుకోకుంటే తెలంగాణ ప్రజలే తరిమి తరిమి కొడతారని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
దున్నపోతు మీద వానపడ్డట్టు
బీజేపీ తెలంగాణ వ్యతిరేక వైఖరితో రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దకకుండా పోతున్నదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంకోసం 150 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ఎన్నో వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా మంత్రులు, ఎంపీలు లెకలేనన్ని విజ్ఞప్తులు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కేంద్రం ఎన్నడూ స్పందించలేదని విమర్శించారు. దేశంలో ఎకడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం లేదని 2017లో కేంద్రం ప్రకటించడం, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టాన్ని అవమానించడమేనని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా తన రాజకీయ ప్రయోజనాల కోసం మహారాష్ట్ర లాతూర్కు 2018లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నరేంద్రమోదీ ప్రకటించారని తెలిపారు. ఈ మరఠ్వాడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకోసం రూ.625 కోట్లు విడుదలచేసిన కేంద్రం, తెలంగాణపై మాత్రం సవతి ప్రేమను చూపించిందని ఆరోపించారు.
కేసీఆర్ సారు సల్లంగుండాలె..
మేం.. ఏ దిక్కులేకుంటున్నోళ్లం సారు. సీఎం సారు తోడవుట్టినోనిలెక్క ఇల్లిచ్చిండు. సంతోషమనిస్తుంది సారు. అన్నయ్య ఇంట్ల ఆస్తి పంచిచ్చినట్లున్నది. కేసీఆర్ సారు సల్లంగ నూరేళ్లు బతికుండాలె. మా అసోంటోళ్లు శానా మందున్నరు. మాకు ఉందామంటె ఇల్లుగూడ లేకుండె. కొన్ని రోజులు నిద్రగూడవోలె. ఇండ్లిస్తున్నరంటే కల అనుకున్నం. ఇండ్లిస్తున్నరన్నంక నిద్రపోయిన. నా అన్న ఇచ్చిండు అనుకొని ఇంట్ల అచ్చి ఉంటున్న.
-గొట్టె రాజేశ్వరి, డబుల్ బెడ్రూం లబ్ధిదారు, వెంకటాపూర్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా