సారంగాపూర్, మే16 : నిర్మల్ జిల్లాలో ఈజీఎస్ ద్వారా చేపడుతున్న పనులను కేంద్రం బృందం పరిశీలిస్తున్నది. బృందంలోని సభ్యులు వివిధ మండలాల్లో విడివిడిగా పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కాగా, సారంగాపూర్ మండలంలోని ఆలూర్, జామ్, సారంగాపూర్, మల్లక్చించోలి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను సోమవారం నేషనల్ మానిటరింగ్ టీం సభ్యుడు కే.వెంకటరవి పరిశీలించారు.
పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, సీసీరోడ్లు, ఇంకుడు గుంతలు, మ్యాజిక్ పిట్లు, కంపోస్టు పిట్, హరితహారంలో నాటిన మొక్కలు, రైతువేదికలు, సెగ్రిగేషన్షెడ్లు, పల్లెప్రగతి రికార్డులు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామాల్లో మొక్కలు నాటారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన వెంట ఉన్నారు.