హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫలితాలను శుక్రవారం సీబీఎస్ఈ విడుదల చేసింది. పేపర్ -1కు 14,22,959 మంది అభ్యర్థులు హాజరుకాగా, 5,79,844 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. 12,76,071 మంది అభ్యర్థులు పేపర్2 పరీక్ష రాయగా, 3,76,025 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గత ఏడాది డిసెంబర్ 22న సీ టెట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.