యాదాద్రి: కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రహ్లాద్ జోషీకి.. అర్చకులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అర్చకులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. అంతకుముందు ఆయనకు ఆలయ అధికారుల, అర్చకులు ఆలయం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.